వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఆన్లైన్లో రిలీజ్
BDK: భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వారు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేశారు. కావలసినవారు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందిగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కే దామోదర్ రావు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. వెబ్సైట్ https://bhadradritemple.telangana.gov.in ను సంప్రదించాలన్నారు.