బీసీ హాస్టల్ సమస్యపై ఛైర్మన్ ఆగ్రహం
KRNL: ఆదోని మండలం పెద్ద హరివాణంలోని బీసీ బాయ్స్ హాస్టల్ను రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్లలో పైపులు, సమ్మర్లో ఫ్యాన్లు లేకపోవడం, ఆహారంలో ఇబ్బందులు వంటి సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.