విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే..?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం స్వామి వారికి భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,26,421 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 122 మంది స్వామి వారిని దర్శించుకున్నారని, 13 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 1,700 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారన్నారు.