27వ వార్డ్లో ఆరోగ్య లక్ష్మీ కార్యక్రమం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 27వ వార్డ్లో వార్డ్ కౌన్సిలర్ చిరివెళ్ళ లక్ష్మీ కాంతమ్మ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆరోగ్య లక్ష్మీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ సేవలు పొందాలని సెంటర్లో ఇచ్చే పౌష్టికహారం తీసుకొవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పద్మ, ఆయా శ్రీలత తదితరులు పాల్గొన్నారు.