జనన ధ్రువీకరణకు ఆధార్ చెల్లదు
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ఆధార్ కార్డును జనన ధ్రువీకరణ పత్రంగా, పుట్టిన తేదీ రుజువుగా పరిగణించబోమని తెలిపాయి. నకిలీ ధ్రువపత్రాల వినియోగాన్ని అరికట్టేందుకు.. జనన, మరణాల నమోదు చట్టం (సవరణ) 2023కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటివరకు నకిలీ సర్టిఫికెట్లను జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాయి.