'పవన్ కళ్యాణ్కు 'సద్బుద్ధి' ప్రసాదించాలి'
తిరుపతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు భగవంతుడు సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ.. YCP నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. పవిత్రమైన తిరుమలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదని, భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకుండా పవన్కు సరైన జ్ఞానం ఇవ్వాలని అలిపిరిలో శ్రీవారిని ప్రార్థించారు.