నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NTR: నందిగామ మండలం తొర్రగుడిపాడు సబ్స్టేషన్లో మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నాగేశ్వరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లగిరి, సోమవరం, రుద్రవరం, రాఘవాపురం, అమ్మవారిపాలెం, గొల్లమూడి, మాగల్లు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు.