వెంకన్న దర్శించుకున్న చింతమనేని

ELR: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సాంప్రదాయ వస్త్రాలు ధరించి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.