'రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి'
PPM: రాబోయే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు సమన్వయ సమీక్షా సమావేశం బుధవారం పార్వతీపురంలో నిర్వహించారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.