జలాశయంలో 275 క్యూసెక్కుల నీరు ఆవిరి

జలాశయంలో 275 క్యూసెక్కుల నీరు ఆవిరి

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయంలో గురువారం ఉదయం 6 గంటల నాటికి 275 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నట్లు జలాశయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుండి జలాశయానికి ఎటువంటి నీరు రావడంలేదని చెప్పారు. జలాశయంలో 50.562 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు తెలియజేశారు. పెన్నా డెల్టాకు 930 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.