ఫీజులు కట్టలేని సర్కార్.. అభివృద్ధి చేస్తుందా?: KTR
TG: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్కు భరోసా లేకుండా పోయిందని మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. విద్యార్థుల ఫీజులు కట్టలేని ప్రభుత్వం.. జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేస్తుందా? అని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ లక్షలాది మంది విద్యార్థుల ఫీజులు కట్టలేదని ఆరోపించారు. మరో వైపు ఉద్యోగుల బాధను కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.