10 నుంచి విశాఖలో టీటీ పోటీలు
VSP: ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఎస్3 స్పోర్ట్స్ ఎరీనాలో 40వ ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ను నిర్వహించనున్నట్లు విశాఖ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ వీ.ఎస్. జయశంకర్ తెలిపారు. సోమవారం ఎంవీపీ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.