కోడి పందాల స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

కోడి పందాల స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

అన్నమయ్య: మదనపల్లి మండలం సీటీఏం ఆంజనేయుని గుడి సమీపంలో కోడి పందాలు ఆడుతున్న ఐదుగురిని తాలూకా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ కళావెంకటరమణ ఆదేశాలతో ఎస్సై రామకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పందెం రాయుళ్ల నుంచి రెండు కోళ్లు, 5 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.