రాజానగరంలో మద్యం 'ధరల' దోపిడి
E.G: రాజానగరం నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. ప్రతి బాటిల్పై MRP కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్మిట్ రూమ్లలో లూజ్ మద్యం అమ్మకాలు, బిల్లులు ఇవ్వకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిండికేట్లపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు