పాలియేటివ్ కేర్ సెంటర్ను సందర్శించిన DMHO
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని పాలియేటివ్ కేర్ సెంటర్ను ఇవాళ DMHO డా.డి.రామారావు, మెడికల్ సూపరింటెండెంట్ డా. నరేందర్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాలియేటివ్ కేర్లో ఇన్ పెషేంట్లుగా వున్న వారితో మాట్లాడి అందుతున్న సేవలు, సిబ్బంది ప్రవర్తనల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది క్రమశిక్షణతో పాటు సమయపాలన తప్పక పాటించాలని సూచించారు.