సి.బెళగల్లో నిరసన చేపట్టిన నాయకులు
KRNL: సి.బెళగల్లో ఆర్&బీ రోడ్డు విస్తరణ కోరుతూ సీపీఎం, ఎంఎస్పీ నాయకులు అంబేడ్కర్ విగ్రహం కూడలిలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరగొండ జోజి మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా సింగిల్ రోడ్డు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బంకులు తొలగించి 40 అడుగుల వెడల్పుతో డబుల్ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు.