రంగాపురంలో వ్యక్తి దారుణ హత్య
NDL: బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో అర్ధరాత్రి మహబూబ్ బాషా(30) దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన మహబూబ్ బాషాను దుండగులు హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర రావు, ఎస్సై రమేశ్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.