గోదావరిఖనిలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు
PDPL: ఈ నెల 16న గోదావరిఖనిలోని సింగరేణి ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ను నిర్వహించనున్నట్లు సింగరేణి ఆర్జీ 1 జీఎం డీ.లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీ 1, 2, 3, ఏఏల్పే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, CPRMSE & CPRMSNE కార్డు కలిగిన రిటైర్డ్ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.