నేడు పట్టుబడిన ఇసుక వేలం
ASF: కడెం మండలం నర్సాపూర్ గ్రామపంచాయతీ అనుమతుల్లేకుండా తరలిస్తూ పట్టుబడిన నాలుగు ట్రాక్టర్ల ఇసుకకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వ హిస్తున్నట్లు తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. ఆసక్తి కల్గినవారు ఆన్లైన్లో రుసుం చెల్లించి వేలంలో పాల్గొనాలని MRO సూచించారు. అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.