ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం: అదనపు కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం: అదనపు కలెక్టర్

MDK: జిల్లాలో ఏప్రిల్ 10 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 518 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, కొనుగోలు ప్రక్రియకు అవసరమైన గన్ని బ్యాగులు, తూకం యంత్రాలు, తార్పాలిన్ కవర్లు వంటి సామాగ్రిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.