స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని మోదీ లేఖ
ప్రధాని మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఆయనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంపై అభినందనలు తెలిపారు. సభా సంప్రదాయాలు, స్పీకర్ బాధ్యతలపై బిర్లా ఇచ్చిన స్టేట్మెంట్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. పార్లమెంట్ కోట్లాది మంది ఆకాంక్షలకు ప్రతిరూపమని.. సభను హుందాగా, ఓర్పుతో నడిపిన తీరును మోదీ ఈ లేఖలో ప్రత్యేకంగా కొనియాడారు.