గద్వాలలో TOSS పరీక్షల షెడ్యూల్ ఖరారు..

గద్వాలలో TOSS పరీక్షల షెడ్యూల్ ఖరారు..

గద్వాల జిల్లాలో TOSS ఇంటర్, SSC పరీక్షలు ఈనెల 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. జిల్లా కేంద్రంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేయగా 1276 మంది హాజరవుతారు. పరీక్ష కేంద్రాలకు ఒక గంట ముందుగా రావాలని, సెల్‌ఫోన్లు నిషేధమని, సెక్షన్ 144 అమల్లో ఉంటుందని సూచించారు.