నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం
PPM: అంగన్వాడీ కేంద్రాల ద్వార గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఇవాళ ఆదేశించారు. నవంబర్ నెలకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలకు వివిధ నిత్యావసర వస్తువుల సరఫరా మరియు పంపిణీపై సంబంధిత శాఖల అధికారులతో పార్వతీపురంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు.