VIDEO: ఖైరతాబాద్ గణేష్ వద్ద తొలి రోజు పూజ చేసిన గవర్నర్

HYD: ఖైరతాబాద్లో ఏర్పాటు చేసిన శ్రీ విశ్వశాంతి మహా గణపతి వద్ద తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజలు నిర్వహించారు. తొలి పూజల అనంతరం భక్తులను దర్శనానికి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అనుమతించారు. దీంతో భక్తులు ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో రద్దీ నెలకొంది.