138 పరిశ్రమలకు అనుమతులు మంజూరు: జేసీ

VZM: పరిశ్రమల స్థాపన కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి, నిర్ణీత కాలవ్యవధిలోగా అనుమతులను మంజూరు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిశ్రమల కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు 149 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఇప్పటివరకు 138 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు.