'రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి'

'రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి'

ప్రకాశం: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ సూచించారు. సీఐ కార్యాలయ ఆవరణలో రౌడీ షీటర్లకు శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్ల‌పై నిరంతరం పోలీస్ నిఘా కొనసాగుతుందని, పాత ప్రవృత్తిని విడనాడి, మంచిగా మెలగాలన్నారు. బెయిల్‌పై తిరుగుతున్న రౌడీ షీటర్‌లైనా మళ్లీ నేరాలకు పాల్పడితే బెయిల్ రద్దు అవుతుందని తెలిపారు.