ఆలయ అభివృద్ధి కోసం విరాళం

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో కడప జిల్లా దువ్వూరు గ్రామానికి చెందిన మురళీకృష్ణ కుటుంబ సభ్యులు బుధవారం నాడు అమ్మవారిని దర్శించుకున్నారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు 25వేల రూపాయల విరాళాన్ని వారు ఆలయ అధికారులకు అందజేశారు. వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను ఇచ్చారు.