బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలం వల్లభరావుపేటలో గ్రామానికి చెందిన సోషల్ మీడియా వారియర్ కీర్తి రవి తండ్రి ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిరంజీవి, రమణ, అప్పలరాజు ఉన్నారు.