ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: DMHO
HNK: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నేటి నుంచి జూన్ 12 వరకు నాలుగు దశల్లో వైద్య శిబిరాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని HNK జిల్లా డాక్టర్ అప్పయ్య తెలిపారు. మొదటి దశలో నేటి నుంచి 31 వరకు స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు.