తమిళనాడు ఎన్నికలు.. స్టార్ క్యాంపెయినర్గా రేవంత్
TG: తమిళనాడు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. కాగా, తమిళనాడులో 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా.. మే 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.