మాజీ డీసీసీ అధ్యక్షుడి కుటుంబానికి సుగుణ పరామర్శ

మాజీ డీసీసీ అధ్యక్షుడి కుటుంబానికి సుగుణ పరామర్శ

MNCL: ఆసిఫాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ తల్లి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మంచిర్యాల పట్టణంలోని విశ్వప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. భౌతిక దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ఆత్రం సుగుణ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.