పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ ఛైర్మన్
SRD: పుల్కల్లోని కోదండరామ కాటన్ మిల్లో సీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జోగిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పత్తి రైతులు దళారులను నమ్మవద్దని కోరారు. నేరుగా సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలన్నారు.