మావుళ్లమ్మ ఆలయ ధర్మకర్తల మండలికి నోటిఫికేషన్

W.G: భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. హిందూ మతానికి చెందిన 13 మందిని ధర్మకర్తలుగా నియమిస్తారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలయం వద్ద దరఖాస్తులను పొందవచ్చని ఆయన తెలిపారు.