ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచిన ఎమ్మెల్యే
NLR: బుచ్చి పట్టణంలోని కరిముల్లా తోపుడు మిషన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి లక్ష రూపాయలు నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక టీడీపీ నాయకుడు రామానాయుడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వేమిరెడ్డి దంపతులు వారికి 50 వేల రూపాయలను సహాయాన్ని అందజేశారు. వేమిరెడ్డి దంపతులకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.