బొబ్బిలి రైల్వే స్టేషన్లో 256 కేసులపై విచారణ
VZM: బొబ్బిలి రైల్వే స్టేషన్లో శుక్రవారం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లో, రైలులో నమోదైన కేసులను విచారించి జరిమానా వేసి క్లోజ్ చేశారు. రైల్వే ట్రాక్ దాటిన వారు, నో పార్కింగ్ స్థలంలో వాహనాలు పార్కింగ్ చేసిన వారు, రైలులో, ప్లాట్ ఫామ్లపై మద్యం తాగి అల్లర్లు చేసిన వారిపై 256 కేసులు నమోదు చేసినట్లు RPF ఇన్స్స్పెక్టర్ PC పండా పేర్కొన్నారు.