శ్రీశైలంలో ఉగాదికి పాదయాత్ర అనుమతి
NDL: ఉగాది మహోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి శ్రీశైలానికి పాదయాత్రకు అనుమతి ఉందని ఈవో ఎం. శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. వెంకటాపురం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని, భక్తుల సౌకర్యార్థం శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉత్సవాలు మార్చి 16 నుంచి 20 వరకు జరగనున్నాయని, నాలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని అయన పేర్కొన్నారు.