'PRC కమిషన్ వేసి IR వెంటనే ప్రకటించాలి'
KKD: ఉద్యోగ ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ కమిషన్ వేసి IR వెంటనే ప్రకటించాలని PDF టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. పిఠాపురం మండలంలో పలు హై స్కూల్స్ను ఆయన సందర్శించి, టీచర్స్ ఇబ్బందులను తెలుసుకున్నారు. 2023 జూన్తో 11వ పీఆర్సీ ముగిసిపోగా, 12వ పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగ టీచర్స్ నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు.