గుడిహత్నూర్లో అడవుల సంరక్షణపై అవగాహన
ADB: గుడిహత్నూర్ మండలంలోని అనంతపూర్, దంపూర్, ధమాన్ గూడా గ్రామాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులను అక్రమంగా నరుకడం వల్ల జంతుజాలం, పర్యావరణానికి కలిగే నష్టాలపై గ్రామస్తులకు వివరించారు. అడవుల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ అధికారులు ప్రశాంత్, ఇమ్రాన్ తెలిపారు.