ఎదురు కాల్పులు.. జవాన్ మృతి

ఎదురు కాల్పులు.. జవాన్ మృతి

జమ్మూకశ్మీర్ కిష్త్వార్ జిల్లా చత్రూ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు జల్లెడ పట్టాయి. బలగాలను గమనించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో జవాన్ మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కాగా, నిన్న జరిగిన కాల్పుల్లోనూ ఓ జవాన్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.