ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
NRPT: మద్దూరు పట్టణంలో ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ప్రాణాల భద్రత డ్రైవర్ బాధ్యతని ఆయన తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరమని ఎస్సైహెచ్చరించారు.