మద్యం మత్తులో వ్యక్తి మృతి
VZM: మద్యం మత్తులో ఓ వ్యక్తి మదుంలో పడి మృతి చెందిన ఘటన కొత్తవలస ఆర్ధన్నపాలెంలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బలిఘట్టం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్(52) ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆదర్శ పాఠశాల వైపుగా వెళ్తున్న వ్యక్తి మృతదేహాన్ని చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.