ముగిసిన WPL-2026 మెగా వేలం
WPL-2026 మెగా వేలం ముగిసింది. ఈ వేలంలో 23 మంది విదేశీ క్రికెటర్లతో కలిపి మొత్తం 67 మంది ప్లేయర్లని ఫ్రాంఛైజీలు తీసుకున్నాయి. అన్ని టీమ్లు కలిసి రూ.40.8 కోట్లు ఖర్చు చేశాయి. కాగా, మెగా వేలంలో భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ అత్యధిక ధర పలికారు. ఆమెను 3.20 కోట్లతో యూపీ వారియర్స్ RTM కార్డు ఉపయోగించి తీసుకుంది.