విద్యుత్ ఘాతంతో లైన్ మెన్ మృతి

BPT: పేరాల జక్కావారి వీధిలో విద్యుత్ పోల్పై పనిచేస్తూ కరెంట్ షాక్ కొట్టడంతో సునీల్ అనే ప్రైవేట్ లైన్మెన్ శనివారం సాయంత్రం మృతి చెందాడు. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న సునీల్ విద్యుత్ స్తంభం ఎక్కి పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. పనులు జరుగుతున్నా విద్యుత్ సరఫరా ఆపకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.