VIDEO: పత్రిక కథనంపై సెక్యూరిటీ గార్డ్స్ నిరసన
E.G: రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 'భద్రతకు సుస్తి' అనే పేరుతో ఓ దినపత్రికలో కథనం రాయడంపై ఏపీ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ శనివారం ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించాయి. నిరసనలలో AITUC జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడారు. ఆసుపత్రిలో భద్రతా లోపాలు వలన దొంగతనాలు జరుగుతున్నాయని కథనాలు రాయడం సరికాదన్నారు.