మాజీ ఎంపీటీసీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే
KRNL: చిప్పగిరి మండలం నేమకల్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ వెల్డింగ్ లక్ష్మన్న, ఉనురు గొల్ల మల్లికార్జున అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఇవాళ గ్రామానికి వెళ్లి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.