మంగళరూపిణిగా విరుపాక్షి మారెమ్మ దర్శనం

CTR: పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ విరుపాక్షి మారెమ్మకు మంగళవారం సందర్భంగా పూజలు చేశారు. అమ్మవారు మంగళరూపిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహాన్ని అర్చకులు ఫల పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, నిమ్మకాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన హారంతో అలంకరించారు.