పులివెందులలో న్యాయవాదిపై దాడి

పులివెందులలో న్యాయవాదిపై దాడి

KDP: పులివెందులలో న్యాయవాది మిట్ట సతీష్ కుమార్‌పై దాడి జరిగింది. నోటరీ పని అనంతరం ఫీజు అడిగినందుకు రామిరెడ్డి శివానందరెడ్డి అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానిక న్యాయవాదుల్లో ఆందోళన నెలకొంది. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తులసీరామ్ సహా పలువురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.