ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కేసు నమోదు
KDP: తొండూరు మండలంలోని ఇనగలూరులో ఇరువురు వ్యక్తుల మధ్య ఘర్షణ జరగడంతో కారు ధ్వంసమైంది. ఎస్సై ఘన మద్దిలేటి కథనం మేరకు.. ఇనగలూరు గ్రామానికి చెందిన గణేశ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డిలు అమ్మాయి విషయమై కక్ష పెంచుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగి కారు ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.