ఈ నెల 11న సర్వసభ్య సమావేశం

ఈ నెల 11న సర్వసభ్య సమావేశం

AKP: ఈ నెల 11వ తేదీన నాతవరం మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామని ఎంపీడీవో ఎంఎస్.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అధ్యక్షత వహిస్తారని చెప్పారు. కావున మండల ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులంతా హాజరుకావాలని ఆయన కోరారు.