మున్సిపల్ కార్మికుల డిమాండ్లపై ధర్నా
NDL: డోన్లో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. జీతాల పెంపు, 12వ పీఆర్సీ అమలు, సమ్మె ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్కు పార్టీ పట్టణ కార్యదర్శి మాణిక్యం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.